Wednesday, August 7, 2013

" నీలో నేనై, నాలో నీవై తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ ఉందాము"



ఘంటసాల మాస్టారు గారి సంగీత దర్సకత్వంలో ఇంకొక ఆణిముత్యం "ఆలీబాబా 40 దొంగలు". 1970 లో విడుదల.  శ్రీ B విఠలాచార్య నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం. 

 1950 లో హిందీలో,  1956 లో తమిళంలో  విజయాలు సాదించిన చిత్రం. 
తమిళంలో  శ్రీ T R రామచంద్రన్,  మోడరన్ థియేటర్ బ్యానర్ పై  నిర్మించారు.  1956 లో విడుదలైన చిత్రాన్ని తెలుగు లో అనువదించారు. ఈ చిత్రంలో M G రామచంద్రన్, భానుమతి, P S వీరప్పన్, తంగవేలు నటించారు. 

తెలుగు లో నందమూరి తారక రామారావు, జయలలిత నటించారు. ఈ చిత్రం లో ఘంటసాల సుశీల  గారలు 
పాడిన " నీలో నేనై, నాలో నీవై,  తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ  ఉందాము"  ఒక చక్కటి పాట. ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సహకారంతో, వారికి ధన్యవాదాలు. 
 

 

1 comment: