Monday, August 5, 2013

" నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో"


రాజ్యలక్ష్మి సంస్థ నిర్మించిన  "గుడిగంటలు" 1964 లో విడుదలై విజయం సాదించిన చిత్రం.  దర్శకుడు శ్రీ V మధుసూదన్ రావు, సంగీత సారత్యం శ్రీ ఘంటసాల మాస్టారు. దాదాపు అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. 
శ్రీ ఆత్రేయ వ్రాసిన " నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో" మంచి  మెలోడీ పాట. ఎన్ని సార్లు విన్నా, మరీ మరీ వినాలనే కుతూహలం కలుగు తుంది. శ్రీ ఆత్రేయ గారు పాటలో నాయికను, ఎల్లోరా గుహలో శిల, నండూరి వారి ఎంకి, విశ్వనాథ వారి కిన్నెర, బాపిరాజు గారి శశికళ, కవి కాళిదాస్ శకుంతల తో  పోల్చడం, ఈ మాటలను ఘంటసాల గారి నోట వింటూ ఉంటె, చెప్పలేని హాయి. పాట ఎంత అందంగా వ్రాయబడిందో, మాస్టారు అంత అందంగాను పాడారు. 
  ఆ పాట విందాము. వీడియో సహకారం వోల్గా, యు ట్యూబ్ ద్వారా. వారికీ ధన్యవాదాలు  



 

3 comments:

  1. Melodious song by our great GHANTASALA!Thanks!

    ReplyDelete
    Replies
    1. Thanks. Indeed a very melodious song composed and sung by the great Ghantasala mastaru. even the lyric by Aathreya is too good.

      Delete
  2. Very melodious and romantic song

    ReplyDelete