Tuesday, July 30, 2013

"ప్రేమించ నిదె పెళ్ళాడనని తెగ కోతలు కోశావులే"


అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రం " ఆత్మగౌరం" 1965  లో  విడుదలైంది.  శ్రీ విశ్వనాధ్ గారు తొలిసారి దర్సకత్వం వహించిన చిత్రం ఆత్మగౌరం. కథ:  యద్దనపూడి సులోచనా రాణి, గొల్లపూడి మారుతీ రావు. అన్నపూర్ణ సంస్థకు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చడం "ఇద్దరు మిత్రులు" చిత్రంతోనే ప్రారంభం. ఈ చిత్రం లోని పాటలు ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిన విషయమే.

ఆత్మగౌరం చిత్రం లోని పాటలు కూడా అంతే ప్రజాదరణ  పొందింది. ఈ చిత్రంలో దాదాపు 10 పాటలు ఉన్నాయి. అన్నీ మెలోడీ గీతలే.  ఘంటసాల మాస్టారు, సుశీల గారితో పాడిన  యుగళ గీతం  "ప్రేమించ నిదె పెళ్ళాడనని  తెగ కోతలు కోశావులే"  చాల చక్కటి పాట.  ఆ పాట వినండి. ఘంటసాల గారు ఎంతో చలాకీగా  పాడారు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు చక్కటి బాణీ సమకూర్చి పాటకు మరింత అందం తెచ్చారు. వీడియో సహకారం యూ ట్యూబ్ మరియు వోల్గా. వారికి ధన్యవాదాలు.  



 

No comments:

Post a Comment