Friday, May 18, 2012

"ఓహో.. ఓహో.. నిన్నే కోరెగా కుహూ కుహూ అనీ కోయిల"



 
 
అన్నపూర్ణ పిక్చర్స్ " ఇద్దరు మిత్రులు" 29-12-1961 లో విడుదల అయిన చిత్రం. అక్కినేని ద్విపాత్రభినయం, గుమ్మడి, రాజసులోచన, ఈ. వి. సరోజ, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగు వారు
 నటించగా, ఆదుర్తి సుబ్బా రావు దర్సకత్వం వహించారు. సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చారు. ఈ 
చిత్రంలోని పాటలు అన్ని సూపర్ హిట్స్.   "ఓహో.. ఓహో.. నిన్నే కోరెగా కుహూ కుహూ అనీ కోయిల", ఘంటసాల, సుశీల ఎంతో మధురంగా గానం చేసారు. మంఛి మెలోడి పాట.  50 సంవత్సరాలు         పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోని పాటల్ని,  నేటికి కూడా అంతే ఆదరణ తో వింటున్నారు శ్రోతలు. ఆ ఘనత సాలూరు వారికీ, ఘంటసాల వారికీ, సుశీల గార్లకు చెందుతుంది. ఆ పాట వినండి. వీడియో క్లిప్పింగ్ యుట్యూబ్ నుండి సేకరించబడినది.

No comments:

Post a Comment