Sunday, June 16, 2013

"చెప్పాలని ఉంది దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది"

శ్రీ N A T సంస్త నిర్మించిన చిత్రం "ఉమ్మడి కుటుంబం". శ్రీ నందమూరి తారక రామారావు, సత్యనారాయణ, సావిత్రి, కృష్ణకుమారి, వాణిశ్రీ నటించిన ఈ చిత్రం 1967 లో విడుదలై ప్రజాదరణ పొందింది. చిత్ర దర్శకుడు యోగానంద్, సంగీత దర్శకుడు T V రాజు. అన్ని పాటలు బాగున్నాయి.  ఘంటసాల మాస్టారు ఏ పాట పాడినా వంద శాతం న్యాయం చేకూరుస్తారు. సినారె వ్రాసిన పాట "చెప్పాలని ఉంది  దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది", ఘంటసాల మాస్టారు, సుశీల యుగళ గీతం. మంచి మెలోడీ, మెల్లగ సాగే పాట. ఆ పాట విందాము. 


2 comments: