Saturday, April 14, 2012

పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో

శరత్ నవల ఆధారంగా తీసిన చిత్రం "దేవదాసు". ఈ చిత్రం 26-06-1953   విడుదలై, తెలుగు చిత్ర సీమలో ఒక మైలు రాయిగా నిలిచిపోయి, అశేష ఆదరణ పొందిన చిత్రరాజం. సాంఘిక చిత్రాలలో ఒక కళాఖండం.  ఇది బెంగాలి నవల అయినా, మన తెలుగు నాట, ఈ చిత్రం ద్వారా ఆ  నవలకు విశేష ఆదరణ పొందిన మాట వాత్సవం. ఆరుగురు అతిరథ మహారథుల కృషి ఫలితమే ఈ దేవదాసు చిత్ర విజయానికి కారణం.  వారు, శ్రీయుతులు D.L నారాయణ (నిర్మాత), వేదాంతం రాఘవయ్య (దర్శకుడు), సీనియర్ సముద్రాల (పాటలు-మాటలు), సుబ్బరామన్ (సంగీత దర్శకుడు), ఘంటసాల (గాయకుడు),  అక్కినేని నాగేశ్వర రావు (కథానాయకుడు).  సావిత్రి మరపురాని నటన, B S రంగా (ఫోటోగ్రఫి) కూడా చిత్ర విజయానికి కారణం అయింది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలు. ఘంటసాల మాస్టారు ఆ పాటలకు జీవం పోసి చిరస్థాయిగా నిలిపారు. నేటికి ఆ పాటలన్నీ క్రొత్తగా ఉన్నాయి అంటే, ఆ కీర్తి శ్రీ సుబ్బరామన్, ఘంటసాల గారిదే.
పట్నంలో చదువు ముగుంచుకొని, తన చిన్న నాటి స్నేహితురాలు పార్వతి ని చూడాలని, దేవదాసు కొండంత ఆశతో తన ఊరికి వస్తూ పాడుకొనే పాట "పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో". ఘంటసాల గారి లేత గొంతులో ఈ పాట చాల చక్కాగా ఉంది. ఆ పాట వినండి. ఆనందించండి.



No comments:

Post a Comment