ఈ పాట ఘంటసాల గారు పాడిన పాట కాదు. గమనించ గలరు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి జయంతి (12 అక్టోబర్ ), వర్ధంతి ( 26 అక్టోబర్) పురస్కరించుకొని, ఆయన్ను స్మరిస్తూ, ఆయన పాడి, స్వర పరచిన గీతం " చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" పాట విందాము.
శ్రీ సాలూరు గారికి ఎంతో ఇష్టమైన రాగాలు: యమునాకళ్యాణి. మోహన, భీంప్లాస్, శుద్ధసావేరి, మాల్కోస్, హిందుస్తానీ భైరవి.
ఈయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు.
సాలూరు గారికి అభిమాన సంగీత దర్శకులు : శ్రీ నౌషద్ అలీ ( హిందీలో), తెలుగు లో పెండ్యాల, తమిళంలో M S విశ్వనాథన్.
అభిమాన గాయకులు: ఘంటసాల, సైగల్, పంకజ్ మల్లిక్ , సుశీల.
అపస్వరం తెలియని రాజేశ్వర రావు గారు, సుమధుర సుస్వరాలతో తెలుగు సినిమా పాటకు పట్టాభిషేకం చేసారు . ఆయన పాటలు నిత్య నూతనంగా నేటికీ సజీవమై అలరారుతోంది.
ఇప్పుడు విందాము ఆయన పాడిన పాట: