భరణి స్టూడియోస్ "చండీరాణి" 18 -08 -1953 లో విడుదలైన చిత్రం. నాయికా, నాయకులుగా భానుమతి N T రామారావు గారు నటించారు.
భానుమతి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి, ఆమె దర్సకత్వం వహించారు. భారత దేశ చరిత్రలో ఒక మహిళ దర్సకత్వం వహించిన మొదటి చిత్రం "చండీరాణి". సంగీతం శ్రీ C R సుబ్బరామన్, విశ్వనాథన్/రామమూర్తి సమకూర్చారు. ఘంటసాల, భానుమతి గారలు పాడిన ఒక అద్భుత యుగళ గీతం "ఓ తారకా ఓ... ఓ జాబిలీ". ఈ పాట వింటూ ఉంటె, మనసు అలా అలా ఆనందంతో తేలి పోతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు పాట ప్రారంభంలో మందస్వరంతో పలికిన "నవ్వులేల నను గని" వింటే చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ఈ పాట విన్నతరువాత, మాస్టారుకు ఆ రోజుల్లో ఎంత మంది, అభిమానులు అయ్యారో చెప్పలేము. ఆ పాట వినండి. గీత రచన సముద్రాల సీనియర్.