Showing posts with label "తోబుట్టువులు". 1963. Show all posts
Showing posts with label "తోబుట్టువులు". 1963. Show all posts

Wednesday, October 23, 2013

" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే"

సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా,  దరిజేర్చు దైవము నీవే 
   నా ఆశ తీర్చ రావే"......................
 మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.