Showing posts with label "అంతస్తులు" (posted 03.01.2015). Show all posts
Showing posts with label "అంతస్తులు" (posted 03.01.2015). Show all posts

Saturday, January 3, 2015

"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు "




Anthasthulu.jpg

జగపతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "అంతస్తులు". జగపతి వారికి చిత్రం పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది.   
వారి మొదటి చిత్రం 'అన్నపూర్ణ " తో మొదలై దాదాపు అన్ని చిత్రాలు "అ " లేక :"ఆ"వచ్చినవే. 
అన్నపూర్ణ, ఆరాధన. ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు, అక్కచెల్లెళ్ళు మొదలైనవి. ఆ ఒరవడి ;దసరాబుల్లోడు తో మారింది. 

అంతస్తులు చిత్రం లోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే.  ఘంటసాల సుశీల పాడిన పాట 
"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు ". తెర మీద  అక్కినేని, L విజయలక్ష్మిల 
మీద చిత్రీకరించారు  దర్శకులు V. మధుసూదన రావు, సంగీతం మామ మహదేవన్. గీత రచన ఆరుద్ర చిత్రం విడుదల 27-05-1965.