Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015


ఘంటసాల అభిమానులకు , సంగీతాభిమానులకు 
నా స్నేహితులందరికీ, శ్రేయోభి లాషులకు, 
           పేస్ బుక్ సన్నిహితులకు 
                         
                       
                                                2 0 1 5

                నూతన సంవత్సర శుభాకాంక్షలు 

                                      
                                 కే వీ రావు , అధ్యక్షులు                                                                     కీరవాణి రాగ సాంస్కృతిక సంఘం 


నూతన 

Tuesday, December 30, 2014

" టాటా...... వీడుకోలు..... గుడ్ బై...... ఇంక శెలవు"




2014 సంవత్సరానికి వీడుకోలు పలికే సమయం వచ్చింది. ఇంక కొన్ని ఘంటల్లో 2015 వ సంవత్సరం రాబోతుంది. 
ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర క్షణాలు, ఎంతో విషాదం మిగిల్చింది 2014. అక్కినేని జనవరి 22 నిష్క్రమించారు. అలాగే అంజలి, బాపు గారు,. కి బాలచందర్ గారు వెళ్లి పోయారు. 
ఘంటసాల గారు లేకుండా 40 సంవత్సరాలు గడిచాయి.  కాని అయన పాటలు నిత్యమై, సత్యమై నేటికి వినిపిస్తూనే ఉంది.  ఇలాగే కొన్ని తరాలవరకు వినిపిస్తుంది. అ పాటలన్నీ అజరామరం. 

బాపు గారి దర్సకత్వం వహించిన "బుద్ధిమంతుడు" చిత్రం లో  ఘంటసాల మాస్టారు పాడిన పాట 
" టాటా......  వీడుకోలు.....  గుడ్ బై......  ఇంక శెలవు"     పాటను వీరందరికీ నివాళి గ సమర్పిస్తున్నాను. 
సంగీతం శ్రీ మహదేవన్ పాట సేఖరణ యు ట్యూబ్ ద్వారా. వారికి ధన్యవాదాలు. 




















Tuesday, December 16, 2014

" , " నీ ఆస అడియాస, చేజారే మణి పూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రామదాస"


దర్శక నిర్మాత శ్రీ కి బీ తిలక్ నిర్మించిన చిత్రం ఎం ఎల్. ఎ.  సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం తోనే, గాయని యస్ జానకి సినీ రంగ ప్రవేశం చేసింది. 
ఘంటసాల జానకి పాడిన " నీ  ఆస అడియాస, చేజారే మణి పూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రామదాస" చాలా పాపులర్ అయిన పాట.  ఆ పాట విందాము. ఘంటసాల గారి గళం లో ఎంత ఆర్ద్రత ఉందొ గమనించండి







Friday, December 5, 2014

"గాయకులలో ఘంటసాల ను నేనే"-- శ్రీ కృష్ణ ఉవాచ

డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ  జయంతి.  అంతకు రెండు రోజుల ముందు, అనగా డిసెంబర్ 2, శ్రీ కృష్ణ జయంతి జరిగింది. 
ఘంటసాల మాస్టారు చివర దశలో "శ్రీ భగవథ్గీత " గానం చేసి, తన జన్మ సార్థకం చేసుకున్న మహా మనిషి. 

భగవథ్గీత లోని, 10 వ ఆధ్యాయంలో, శ్రీ గీతా  చార్యుడు చెప్పారు :

                           "మహార్షీ ణామ్ భ్రుగు రహం      
                             గిరామస్మేక్య మక్షరం 
                             యజ్ఞానాం జప యజ్ఞో స్మే 
                             స్థావరాణాం హిమాలయః " 
దీని అర్థం " నేను మహర్షులలో భ్రుగువును, శబ్దములలొ ఓంకారమును , యజ్ఞములలో జప యజ్ఞమును,
స్థావరములలో హిమవంతుడను". 

ఇంకా ఏమి  చెప్పారంటే , దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిల మునియు,
ఏనుగులలో ఐరావతము, దేనువులలో కామధేనువు, సర్పములలో వాసుకి  ఇలా చాలా చాలా, అన్నీ తనే అని  చెప్పారు ........  కాని
గాయకులలో ఎవరో చెప్పకుండా వదేలేసారు.?
మనం ఇప్పుడు  "గాయకులలో ఘంటసాల ను నేనే" అని  కృష్ణుని మాటగా సగర్వంగా చెప్పు కొందాము. మనం ఘంటసాల గారికి ఇచ్చే నిజమైన నివాళి ఇదే.