Thursday, November 7, 2013

"అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది చినదానా"


1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' (అక్కినేని, సావిత్రి), 
(సంగీతం ఘంటసాల) చిత్రాన్ని, హిందీ లో "జీనే కీ రాహ్" అనే పేరుతో శ్రీ 
L V ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం 1969 లో విడుదల. మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీ అనుమోలు వెంకట సుబ్బా రావు గారు 1971 లో 
"భార్యా  బిడ్డలు" (అక్కినేని, జయలలిత) పేరుతో తీసారు.  ఈ చిత్రానికి  శ్రీ 
K V మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్.  ఘంటసాల మాస్టారు పాడిన "అందమైన తీగకు పందిరుంటే చాలును,  పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది  చినదానా" ఒక చక్కటి పాట.  ఆ పాట విందాము.



Saturday, November 2, 2013

" వగలాడి వయ్యారం భలే జోరు, నీ వయ్యారం ఒలికించు ఒన్స్ మోరు"


             ఈ బ్లాగ్ వీక్షిస్తున్న అందరికి "దీపావళి  
                             శుభాకాంక్షలు"      
జగపతి పిక్చర్స్ నిర్మించిన మొదటి చిత్రం ' అన్నపూర్ణ'. ఈ చిత్రం 1960 లో విడుదల. శ్రీ V. మధుసూదన్ రావు దర్సకత్వం వహించగా, సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చారు. అన్ని పాటలు శ్రీ ఆరుద్ర వ్రాసారు. ఈ చిత్రంలో ఘంటసాల-జిక్కి పాడిన యుగళ గీతం " వగలాడి వయ్యారం భలే జోరు,  నీ వయ్యారం ఒలికించు ఒన్స్ మోరు" రేలంగి, గిరిజ మీద చిత్రీకరించిన ఈ పాట, ఆ రోజుల్లో ఒక ఊపు ఊపిన మాట వాస్తవం. ఘంటసాల మాస్టారు ఎంతో హుషారుగా పాడి, పాటకు ప్రాణం పోసారు. ఘంటసాల గారు ఈ చిత్రంలో పాడింది ఈ ఒక్క పాటే అయినా, ఈ పాటే చిత్రానికి హై లైట్ గా నిలిచింది. ఆ పాట విందాము.